- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : బాసర గోదావరి నదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు గల్లంతయ్యారు. బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్లోని కాచిగూడకు చెందిన నెళ్లి చంద్రశేఖర్(38) నెళ్లి రామచందర్ (33) నెళ్లి మల్లేశ్ కుమార్(29) అక్కడి గోదావరి నదిలో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -



