నవతెలంగాణ – లద్దాఖ్: దేశ సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్లోని దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో ప్రమాదం జరిగింది. నదిని దాటే ట్యాంక్ విన్యాసాలు చేస్తుండగా.. ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. టీ-72 ట్యాంక్కు ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి ఉన్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.