ఏ జె ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని పహిల్వాన్ పురంకు చెందిన ఏ జె ఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సౌజన్యంతో సంక్రాంతి సంబరాలలో భాగంగా శనివారం ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన   మనీషా కు మొదటి బహుమతి రూ.2,116 నగదు, శ్యామల జ్యోతి కి రెండవ బహుమతి రూ. 1516 నగదు, మూడవ బహుమతి తాడూరి కుటుంబ సభ్యులకు రూ.1116 చొప్పున ముగ్గురికి అందజేశారు.
మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం : మండలంలోని వెంకటాపురం కు చెందిన మునుకుంట్ల సత్తయ్య అనారోగ్యానికి గురై శుక్రవారం మృతిచెందడంతో వారి కుటుంబానికి ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత జంగారెడ్డి సౌజన్యంతో 5 వేల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ జె ఆర్ ఫౌండేషన్ సభ్యులు, కొత్త నర్సింహా, కొత్త రాం చెంద్రమ్, పులిపలుపుల రాములు తదితరులు పాల్గొన్నారు.

Spread the love