గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరన

నవతెలంగాణ -తాడ్వాయి 

గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెర రమేష్ మేడారంలోని గద్దెల ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెర రమేష్ మాట్లాడుతూ సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన టెట్ నిర్వహించి ప్రమోషన్ ఇచ్చే విధంగా కృషి చేసింది అన్నారు. ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫార్మర్లు నిర్వహించాలని 317 జీవో నెంబర్ బాధ్యులకు న్యాయం చేయాలని అన్నారు. ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు పిఆర్సి డిఏలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎట్టి సారయ్య, మండల అధ్యక్షులు పున్నం చందర్, కోమటిపల్లి ప్రధానోపాధ్యాయులు వాసం సారంగపాణి, రాష్ట్ర కార్యదర్శి మధ్యల అంజయ్య, సంఘం సభ్యులు రేగ కిరణ్ కుమార్ పొదెం మల్లికార్జున్ తదితరు ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.
Spread the love