తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బలోపేతంకు టీఎస్డబ్ల్యూఆర్టి ఈ కృషి చేస్తుంది 

– టీఎస్ డబ్ల్యూ ఆర్ టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూనె దయాకర్
నవతెలంగాణ- మిరు దొడ్డి 
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బలోపేతంకు టీఎస్ డబ్ల్యూ ఆర్ టి ఈ కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూనె దయాకర్ అన్నారు. శనివారం  దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల పరిధి అల్వాల- పెద్ద చెప్యాల కూడలి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో 2024 కు సంబంధించిన క్యాలెండర్ ను ఉపాధ్యాయ ,అధ్యాపక బృందం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందించడానికి ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించాలన్నారు. గురుకులాల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు చాంప్ల, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి,  వెంకటరమణ, కృష్ణమూర్తి, గణేష్,  సునీత, ప్రవళిక, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు
Spread the love