విద్యుత్ఘాతంతో దగ్ధమైన టీటీడీసీ రికార్డు గది..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ శివారులోని సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం (టీటీడీసీ) భవనంలోని రికార్డు గది, పక్కనే గల మరోగదిలో శుక్రవారం
ఉదయం ఒక్కసారిగా విద్యుత్ షార్ట్సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. పొగలను గమనించిన స్థానిక సిబ్బంది వెంటనే డీఆర్డీవో అధికారులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశారు.కాగా డీఆర్డీఓ ఆఫీసు పాత కలెక్టర్ కార్యాలయంలో కొనసాగేది. ఇటీవల కొత్త కలెక్టరేట్కు మారడంతో అక్కడ ఉన్న రికార్డులు, పర్నిచర్ను తీసుకొచ్చి డిచ్పల్లిలోని టీటీడీసీలో భద్రపరిచారు. ఈ భవనానికి మినికలెక్టరేట్గా గుర్తింపు కుడా ఉంది. ప్రతినెల జిల్లా స్థాయి సమావేశాలు ఈ ప్రాంగాణంలో కొనసాగు తున్నాయి. ఘటన స్థలాన్ని డీఆర్డీవో పీడీ సాయాగౌడ్, డీపీఎం శ్రీనివాస్ పరిశీలించారు.
Spread the love