వడదెబ్బతో ఒకరి మృతి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్ పూర్ గెట్ సమీపంలోని ఒక వెంచర్ వద్ద ఆలూరు గ్రామానికి చెందిన కొత్తూరు ఎల్లా గౌడ్ (74) వడ దేబ్బ తగిలి మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం అలుర్ గ్రామానికి చెందిన ఎల్లగౌడ్ గత కొన్ని ఏళ్లుగా మతి స్థిమితం సరిగ్గా లేక తేదీ బుధవారం ఇంటి నుంచి వెళ్లాడని, గురువారం ఒక  వెంచర్ వద్ద రోడ్ ప్రక్కన సరిగ్గా తిండి లేక వడ దెబ్బ తగిలి మృతి చెందినట్లు మృతుని కుమారుడు గోపి గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్సై తెలిపారు.
Spread the love