- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని ముంబై కుర్లా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. నివాస గృహాలపై కొండచరియలు పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో 6 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. శిధిలాల నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మిగతా వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తోంది.
- Advertisement -



