రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద రెండు లక్షల రూపాయలు

నవతెలంగాణ -మద్నూర్

తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ సమీపంలో చేపడుతున్న చెకింగ్ చెక్పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి వెళ్తున్న కారులో 2 లక్షల రూపాయల నగదును అధికారులు పట్టుకున్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సరిహద్దులో చెకింగ్ చెక్పోస్ట్ ఏర్పాటు చేయగా ఇక్కడ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ తదితర శాఖల అధికారులు మహారాష్ట్ర వైపు నుండి తెలంగాణ వైపులోకి వచ్చే వాహనాలను తనిఖీలు చేపడుతున్నారు వాహనాల తనిఖీలు భాగంగా 2 లక్షల రూపాయలు పట్టుబడగా వాటిని సీజ్ చేశారు డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపేంతవరకు ఐటి అధికారులకు అప్పగిస్తున్నట్లు చెకింగ్ అధికారులు తెలిపారు
Spread the love