బైకు లారీ ఢీ..ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – తొగుట
బతుకుదెరువు కోసం వచ్చి ప్రమాదానికి గురై యువకులు మృతి చెందిన సంఘటన మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. శుక్రవారం ఎస్ఐ బి. లింగం తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు కెఎన్ఆర్ కంపెనీ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నారు. 1. అజయ్ కుమార్ (22), 2 విద్యాసాగర్ (22), 3.సచిన్ కుమార్ (19) ముగ్గురు బైక్ పై తుక్కాపూర్ నుండి తొగుట వైపునకు వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ TS22, T2299 నెంబర్ గల లారీ TS36, B1624 నెంబర్ గల బైక్ ను బలంగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాల య్యాయి. అజయ్ కుమార్, విద్యాసాగర్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఉన్న సచిన్ కుమార్ ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించినట్లు తెలిపారు. మృతి చెందిన విద్యాసాగర్ తమ్ముడు అగు పంకజ్ నగర్ పిరియా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్ఐ తెలిపారు.
Spread the love