పండుగ పూట సంగారెడ్డిలో విషాదం..

నవతెలంగాణ సంగారెడ్డి: జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఝరాసంగం మండలం పొట్ పల్లి గ్రామంలో గాలిపటం ఎగరవేస్తూ యువకుడు శివకుమార్(22) కరెంట్ షాక్‌ కొట్టి మృతి చెందాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా శివకుమార్ తన ఇంటి వద్ద గాలిపటం ఎగురవేశాడు. అయితే గాలిపటం ఎగురుకుంటూ వెళ్లి విద్యుత్ తీగలకు ఇరుక్కుంది. దీంతో శివకుమార్ గాలిపటాన్ని తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దీంతో శివ చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించేలోగా మార్గమధ్యలోనే అతడు ప్రాణాలు విడిచాడు. పండగ పూట ఎంతో ఉల్లాసంగా ఆడుతున్న తమ కుమారుడు ఇలా  కండ్ల ముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు భాద వర్ణానాతీతం..  ఆ దృశ్యం చూసే వారిని కూడా కంట తడి పెట్టిస్తుంది.

Spread the love