![Kabul](https://navatelangana.com/wp-content/uploads/2024/01/Kabul.jpg)
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. కాబూల్లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలో కోస్టర్ మోడల్గా గుర్తించబడిన బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఇద్దరు మరణించగా మరో 14మంది గాయపడ్డారు. పేలుడు ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు గురించి కాబూల్ పోలీసు అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ ది ఖొరాసన్ డైరీకి ధృవీకరించారు.