ఆయుర్వేదం గురించి అవగాహన

– ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

నవతెలంగాణ-జక్రాన్ పల్లి
ఆయుర్వేదం గురించి అవగాహన కల్పిస్తు, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించామని వైద్యులు లలిత తెలిపారు. మండలంలొని బ్రాహ్మణ పల్లి గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య శాల పడకల్ ఆద్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని వైద్యులు లలిత తెలిపారు. ఈ సందర్భంగా  దీర్ఘ కాలిక రోగాలు, రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు, స్త్రీల అరుదు క్రమానికి సంబంధించిన వ్యాధులకు, చర్మ రోగాలకు, అజీర్ణం, పక్షవాతం జ్వరాలకు, దగ్గు జలుబు వంటి రోగాలకు చికిత్స చెసి ఉచితంగా ముందు లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సెక్రెటరీ హరీష్, ఫార్మసిస్టులు వరలక్ష్మి నవనీత శకుంతల ఎస్ఎన్ఓ మహేందర్ ఏఎన్ఎం ఆశ వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Spread the love