కాంగ్రెస్ సభకు నిరుద్యోగులు తరలిరండి  

– నిరుద్యోగ జేఏసీ
నవతెలంగాణ- నసురుల్లాబాద్: నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ఈ నెల 25 న జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ సభకు నిర్వహిస్తున్నారని ఈ సభకు నిరుద్యోగులు భారీ ఎత్తున తరలిరావాలని బాన్సువాడ నిరుద్యోగ జేఏసీ కరపత్రాలను విడుదల చేసింది. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరుద్యోగ కరపత్రాలను జెసి విడుదల చేసింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం హాయంలో నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదంటూ ఆరోపించారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి వారి కార్యకర్తలకి లబ్ధి చేకూర్చేలా పనులు చేశారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదంటూ విమర్శించారు. ఉన్నత చదవులుకు సరిగ్గా స్కాలర్ షిప్పులు ఇవ్వడం లేదు. ఫిజ్ రీయంబర్స్ మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ అగమాగం అయింది. విద్య లేదు. వైద్యం లేదు, ఉద్యోగం లేదని ఆరోపించారు. నిరుద్యోగులందరూ. చేయి గుర్తుకు ఓటు వేద్దాం.. కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం.. మార్పును కోరుకుందాం.. ప్రజల పాలన తీసుకోద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగు జెఎసి నాయకులు ప్రేమ్ కుమార్, నవీన్, సంగప్ప, రాము, పాల్గొన్నారు.
Spread the love