గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య ? హత్యనా.?

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగల్ గావ్ శివారు లోని అవాజ్ గుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు, పశువుల కాపర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నాగల్ గావ్ గ్రామానిక చెందిన పశువుల కాపరి పశువులు కాచుకుంచు వెళ్తున్న క్రమంలో గుట్ట వద్ద ఓచెట్టుకు వ్యక్తి ఉరి వేసుకుని ఉన్న దానిని చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్తులు చేరుకుని చూసేసరికి ఎవరో కొత్త వ్యక్తిగా గుర్తించారు. అప్పజికే నాలుగైదు రోజులు అయినట్టుంది. మృత దేహం దుర్వాసన వస్తుండటంతో దగ్గరికి ఎవరు పోవడానికి సహసించలేదు. జుక్కల్  పిఎస్ కు సమాచారం అందించారు. ఎక్కడైన చంపేసి తెచ్చి ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రికరించారా? లేదా నిజంగానే ఆత్మహత్యకు పాల్పడ్జాారా ? పలు అనుమానాలు గ్రామస్తులు వ్యక్తం చేసారు.

Spread the love