కౌంటింగ్‌ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన వల్లభనేని వంశీ, కొడాలి నాని

నవతెలంగాణ – హైదరాబాద్: వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు ఘోర పరాభవం ఎదురైంది. ఓటమి దిశగా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఉన్నారు. దీంతో కౌంటింగ్‌ సెంటర్ల నుంచి వెళ్లిపోయారు. వైసీపీలో ప్రధాన నేతలు వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొడాలి నాని కంచుకోటగా ఉన్న గుడివాడలో ఈసారి టీడీపీ పాగా వేసే అవకాశమున్నట్లు కనిపిస్తుంది.

Spread the love