టికెట్ అడిగిన టీటీఈని రైల్లో నుంచి తోసేసిన ప్రయాణికుడు

నవతెలంగాణ – హైదరాబాద్: కేరళలో రజనీకాంత్ అనే వ్యక్తి జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ క్లాస్ భోగీలో ఎక్కి కూర్చున్నాడు. అదే ట్రైన్లో విధులు నిర్వహిస్తున్న టీటీఈ వినోద్ ప్రయాణికుడు రజనీకాంత్ ను జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ క్లాస్ భోగిలో ఎందుకు ఎక్కావని ప్రశ్నించాడు. ఫైన్ కట్టాలని చెప్పడంతో రజనీకాంత్ గొడవకు దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రయాణికుడు టీటీఈని కదులుతున్న రైలులో నుంచి తోసేశాడు. అదే సమయంలో పక్క ట్రాక్ పై వేగంగా దూసుకొచ్చిన మరో ట్రైన్ వినోద్ ను ఢీ కొట్టింది. దీంతో వినోద్ శరీరం ముక్కలుముక్కలై చనిపోయాడు. ఈ ఘటన ముళంగున్నతుకావు, వడక్కంచెరి రైల్వే స్టేషన్‌ల మధ్య జరిగింది. ఈ షాకింగ్ ఘటన చూసి నివ్వెరపోయిన మిగతా ప్రయాణికులు కాసేపటికి తేరుకుని నిందితుడు రజనీకాంత్ పారిపోకుండా పట్టుకున్నారు. తర్వాతి స్టేషన్ లో రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుల సమాచారంతో రైల్వే సిబ్బంది, అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వినోద్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Spread the love