🚨BREAKING: 7.5 magnitude earthquake in Taiwan #earthquake
The shaking was so bad that people commuting to work stopped.pic.twitter.com/jNgUZm9pMl— AJ Huber (@Huberton) April 3, 2024
నవతెలంగాణ -హైదరాబాద్: తైవాన్ వీపాన్ని భారీ భూకంపం కుదిపేసింది. ఈ ఉదయం చోటుచేసుకున్న ఈ విపత్తు కారణంగా పలు భవనాలు నేలకూలాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. భూకంపం ధాటికి ఏకంగా ఫ్లైఓవర్ఊగిపోయాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విపత్తు సంభవించిన సమయంలో తైపీ నగరంలోని ఓ ఫ్లైఓవర్ కొన్ని నిమిషాల పాటు కదిలింది. దానిపై ఉన్న వాహనదారులు భయంతో ఎక్కడికక్కడే ఆగిపోయారు. మరో చోట మెట్రో బ్రిడ్జి ఊగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తైవాన్ వ్యాప్తంగా భూకంప ప్రభావం కన్పించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ విపత్తు సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. అటు జపాన్ దక్షిణ ప్రాంతంలోని పలు దీవుల్లోనూ ప్రకంపనలు కన్పించాయి. భూకంపం కారణంగా తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి ఈ ముప్పు తీవ్రత తగ్గినట్లు తెలుస్తోంది. తైవాన్లో 25కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనల్లో నలుగురు మృతిచెందగా.. 50 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.