కెనడాలో భారత సంతతి కుటుంబం మృతి… పలు అనుమానాలు

నవతెలంగాణ హైదరాబాద్: కెనడా(Canada)లో భారత సంతతికి చెందిన కుటుంబం (Indian-Origin Family) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటారియో ప్రావిన్స్‌లోని వారి నివాసంలో మంటలు చెలరేగడంతో వారు చనిపోయారు. వాస్తవానికి ఈ ఘటన గతవారమే (మార్చి7) ఈ ఘటన జరిగింది. ఆ ఇంట్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను గుర్తించినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల ద్వారా మృతులను గుర్తించారు. రాజీవ్ వరికూ(51), ఆయన భార్య శిల్పా కొత్త(47), వారి కుమార్తె మహెక్‌గా నిర్ధరించారు. మొదట ప్రమాదవశాత్తూ ఇంట్లో మంటల చెలరేగాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణలో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love