నవతెలంగాణ హైదరాబాద్: హోటల్స్, బార్స్లో విక్రయించే మద్యంపై వ్యాట్ పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం.. ఈ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మహా సర్కార్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మహారాష్ట్రలో లిక్కర్పై వచ్చే జీఎస్టీ రాబడి చాలా అధికంగా ఉంటుంది. ఇక ముంబైలోని 3 స్టార్ కన్నా తక్కువ రేటింగ్ ఉన్న హోటల్స్లో మద్యం సేవలపై మరింత ట్యాక్స్ పెంచాలని అక్కడి యంత్రాంగం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 5శాతంగా ఉన్న ట్యాక్స్.. 10-15శాతం వరకు చేరొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రభుత్వానికి వార్షికంగా రూ. 300 కోట్ల నుంచి రూ. 600కోట్ల వరకు అదనంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది.