సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి గా వట్టే జానయ్య యాదవ్…

– బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
– బిఎస్పీలో చేరిన జానయ్య సతీమణి 13వ వార్డు కౌన్సిలర్  వట్టె రేణుక యాదవ్, తదితరులు
నవతెలంగాణ-సూర్యాపేట : బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట అభ్యర్థి గా  ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ను పేరును బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. జానయ్య సతీమణి 13 వ వార్డు కౌన్సిలర్  వట్టె రేణుక యాదవ్ ముఖ్య అనుచరులతో కలిసి బి.ఆర్.యస్ కు రాజీనామా చేసి ఆదివారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో బీఎస్పీ లో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బహుజన సమాజానికి , నవనిర్మాణానికి కృషి చేసే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని తెలిపారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాలు ఎదగడానికి కృషి చేసే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని పేర్కొన్నారు. సభ్యత్వం పొందిన 13వ వార్డు కౌన్సిలర్ వట్టె రేణుక యాదవ్ మాట్లాడుతూ బహుజన వాదానికి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు  అభివృద్ధి పథంలో నడపడమే ఏకైక లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీలో చేరామని తెలిపారు . ఈ కార్యక్రమంలో వట్టె ఐలమ్మ , సూర్యాపేట బీసీ సెల్ అధ్యక్షుడు కుంభం వెంకన్న, పెన్పహాడ్ బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య , పిల్లలమర్రి  శివాలయం చైర్మన్ వల్లాల సైదులు,  లింగమంతుల స్వామి దేవస్థానం డైరెక్టర్ చింతపండు జానయ్య , బి ఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు మహమ్మద్ చాంద్  పాషా,మాజీ ఎంపీపీ భూక్య కాంతమ్మ ,మాజీ ఎంపిటిసి ముక్కాల పద్మ,మాజీ వార్డు మెంబర్ ముక్కాల లింగయ్య, గొర్రెల పెంపక సంఘం అధ్యక్షుడు  పెద్ద బోయిన జానకి రాములు, రైతు వేదిక కమిటీ కోఆర్డినేటర్ లింగాల సైదులు, 13వ వార్డు బీసీ సెల్ అధ్యక్షుడు రాగం చిన్న లింగయ్య, టి.యస్.డి.ఏ టౌన్ అధ్యక్షుడు వల్లాల బుచ్చయ్య, మంటపల్లి వెంకన్న, దాసరి నరేష్ యాదవ్, పల్లపెల్లి అంజమ్మ, నాగలక్ష్మి,  నియోజకవర్గ మహిళలు , ప్రధాన అనుచరులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love