![విశ్వనాథన్ ఆనంద్ రికార్డు బద్దలు](https://navatelangana.com/wp-content/uploads/2023/09/gukesh-300x188.jpg)
నవతెలంగాణ హైదరాబాద్: యువ గ్రాండ్మాస్టర్ డి గుకేశ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తాజాగా ఫిడే ప్రకటించిన ర్యాంకింగ్స్లో గుకేశ్ ఎనిమిదో స్థానానికి చేరాడు. ఈ క్రమంలో దాదాపు 37 ఏళ్లపాటు భారత్ తరఫున టాప్ ర్యాంకర్గా కొనసాగుతున్న చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును గుకేశ్ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం గుకేశ్ 2,758 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి చేరుకోగా.. విశ్వనాథన్ ఆనంద్ 2,754 పాయింట్లతో ఆ తరువాతి స్థానంలో కొనసాగుతున్నారు. దీంతో భారత్ తరఫున టాప్ ప్లేయర్గా గుకేశ్ అవతరించాడు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ 1986 జులై నుంచి భారత్ నంబర్వన్ ఆటగాడిగా ఉన్న రికార్డును ఇప్పుడు గుకేశ్ అధిగమించాడు. గత ఆగస్ట్ 1 నుంచి మూడు స్థానాలను గుకేశ్ మెరుగుపర్చుకోవడం విశేషం. చెస్ ప్రపంచకప్లో క్వార్టర్ఫైనల్స్కు చేరిన సంగతి తెలిసిందే.