పేద ప్రజల గొంతుక ‘నవతెలంగాణ’

– వీణవంక ఎస్సై బీ వంశీకృష్ణ

నవతెలంగాణ-వీణవంక: నవతెలంగాణ దినపత్రిక పేదల ప్రజల గొతుక అని వీణవంక ఎస్సై బీ వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం నవతెలంగాణ పత్రిక క్యాలెండర్- 2024ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ.. పేదల సమస్యలపై ఎల్లప్పుడూ నవతెలంగాణ పత్రిక స్పందిస్తుందని చెప్పారు. పేదల సమస్యలను ఎల్లప్పుడూ ప్రచురిస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విషయంలో ఎల్లప్పుడూ ముందుండాలని ఆకాంక్షాంక్షించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ వీణవంక, జమ్మికుంట, ఇల్లంతకుంట, హుజురాబాద్ రిపోర్టర్లు కట్టరాజు, ఏబూసి శ్రీనివాస్, సౌడమల్ల యోహన్, బద్దుల రాజుకుమార్, డివిజన్ ఇన్ చార్జి పసునూరి రాజేష్, సీనియర్ జర్నలిస్టు పరంకుశం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love