కారు గుర్తుకు ఓటేసి ప్రభాకరన్నకు గెలిపించాలి

-ఎంపీటీసీ రామవరం మాధవి చంద్రశేఖర్ రెడ్డి 

నవతెలంగాణ -దుబ్బాక రూరల్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామంలో మెదక్ ఎంపీ,దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ ఇంటి వద్ద  వృద్ద మహిళతో వారు కేసిఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు వివరిస్తుండగా కేసిఆర్ దయతోనే  2016 ప్రతి నెల బ్యాంకుల్లో పెన్షన్ పైసలు జమ అవుతాయని తెలిపింది. 2023 ఎన్నికల్లో కేసిఆర్ కి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటు వేయాలని పెద్ద గుండవెళ్లి వార్డ్ మెంబర్ ప్రశాంత్,పద్మనాభునిపల్లి సర్పంచ్ పర్శా రాములు తో కలిసి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను వివరించారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని  ఆవృద్ద మహిళని కోరారు. కార్యక్రమంలో వారీ వెంట బీఆర్ఎస్ నాయకులున్నారు
Spread the love