– భారీగా కాంగ్రెస్లో చేరికలు
– కాంగ్రెస్ అభ్యర్థి మురళీ నాయక్
నవతెలంగాణ-గూడూరు
మహబూబాబాద్ నిజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా క్టర్ మురళి నాయక్ సోమవారం గూడూరు మండలం లో తమ ప్రచారాన్ని కొనసాగించారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో అభ్య ర్థికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ గ్రా మాల నుండి భారీ సంఖ్యలో పలువురు టిఆర్ఎస్ పా ర్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. మండలం లోని మచ్చెర్ల, ఉట్ల, హనుమాన్ తండా, మడ్డవాడ, నీ లవంచ, ఎర్రకుంట తండా, బొద్దుగొండ, కొల్లాపురం, జగన్ నాయకులగూడెం, అపరాజు పల్లి, జంగు తం డా, గోవిందాపురం, దుబ్బ గూడెం, తాళ్లపాటి తండా, లక్ష్యం పురం తండాలలో మురళి నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మురళి నా యక్కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మురళి నాయక్ మాట్లాడుతూ మీ అమూ ల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేసి గెలిపించినట్ల యితే మీకుసేవకుడిగా,అండగా ఉంటానన్నారు. కాం గ్రెస్ అభిమానులుగా అందరూ కలిసికట్టుగా పనిచేసే నా గెలుపుకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. గత తొమ్మిది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో అవినీతి అ క్రమాలు పెరిగాయి తప్ప పేదవాడికి న్యాయం జరి గినా ఆనవాలు లేవని, రానున్నది ఇందిరమ్మ రాజ్యమ ని పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్ర భుత్వ లక్ష్యమని అందులో భాగంగానే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు ఓటర్లకు గుర్తు చేశారు. మండలం లోని వివిధ గ్రామాలలో పేర్కొన్న సమస్యలను తక్ష ణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భం గా సీతానగరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కోమండ్ల రమణారెడ్డి, మరి కొందరు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోల్లపల్లి గ్రా మానికి చెందిన వార్డ్ మెంబర్ ఏరా గట్టుమల్లుతో పా టు మరికొందరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అలాగే పలు గ్రామాలలో కూడా పార్టీలో చేరారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కాం గ్రెస్ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు చిట్టి వెంకన్న, మాధవ్ పెద్ది ర మేష్ చందర్ రెడ్డి, మాధవ పెద్ది ప్రదీప్ రెడ్డి, అరెం వీ రస్వామి, వాంకుడోత్ కొమ్మలు, అమరేందర్ రెడ్డి, బోల్లి కొండ మధు, సర్పంచులు క్షేత్రస్థాయి నాయకులు, కా ర్యకర్తలు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు .
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల కల్పన
మహబూబాబాద్ : వచ్చే శాసనసభ ఎన్నికల్లో గె లిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మురళీ నాయక్ అన్నారు. ఆది వారం రాత్రి కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో కమ్మగాని కృష్ణమూర్తి ఆధ్వర్యంలో శంతన్ రామరాజు అధ్యక్షతన ‘నిరుద్యోగ గోస” సదస్సు జరిగింది. ఈ కా ర్యక్రమానికి కాంగ్రేస్ జిల్లా అధ్యక్షులు జెన్నా రెడ్డి భరత్ చాంద్రారెడ్డి, అభ్యర్థి మురళీ నాయక్లు హాజరయ్యా రు. ఈ సందర్భంగా మురళీ నాయక్ మాట్లాడుతూ ఎందరో విద్యార్థులు మేధావులు బలిదానాలతో రక్తపు ముగ్గులు పోసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా రాక్షస పాలన సాగుతోందన్నారు. ఈ కార్యక్ర మంలో మహబూబాబాద్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉమా మురళీ నాయక్, నాయకులు కంకర అయ్యప్ప రెడ్డి, నారాయణ్ సింగ్, నోముల తిరుపతి రెడ్డి, గంగా దరి బాలరాజు, అంబాల రాజశేఖర్, ఖరాటే కాజా, హ రిప్రసాద్, గణపారపు వీరన్న, జ్యోత్స్న, రాధిక, మాధ వి, నర్సయ్య,మాధవి, మమత, రాము,యాసిన్, రఘు, నీల, రజిత, శిరీష, ఉపేందర్, సురేష్, విశాల్, దాస య్య, వెంకన్న, వసీమ, ప్రభావతి, అర్పిత, నవ్య, చైత న్య, రేణుక, సునీత తదితరులు పాల్గొన్నారు.