అభివృద్ధిని చూసి ఓటెయ్యండి

– సూది రెడ్డి లక్ష్మారెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్

నవతెలంగాణ-గోవిందరావుపేట : గత 9 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేసి గెలిపించాలని వైస్ ఎంపీపీ మరియు పిఎస్సిఎస్ డైరెక్టర్ సూది రెడ్డి స్వప్న లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని లక్నవరం పంచాయతీ దుంపలగూడెంలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లతో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీరు, సిసి రహదారులు, పార్కులు, క్రీడా మైదానాలు, స్మశాన వాటికలు, పెన్షన్లు, నిరంతర విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు రైతు బీమా రుణమాఫీ వంటి పలు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను నిరంతరం ప్రజలకు అందిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న టిఆర్ఎస్ అభ్యర్థిని ఓటర్లు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉందని గ్రహించాలని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి మన నియోజకవర్గంలో వేరే ఎమ్మెల్యే ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడుద్దని అన్నారు. అభివృద్ధి నిరంతరాయంగా నిరాటంకంగా కొనసాగాలంటే కచ్చితంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే జ్యోతక్కను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు మండల కమిటీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love