నవతెలంగాణ – మల్హర్ రావు
ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రధర్ బాబు శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చిన్నచిన్న సమస్యలు వస్తాయనే మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అభయమిచ్చిందన్నారు. ఏడాదికి రూ.12 వేలు అందజేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఈ మాటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వచ్చే బడ్జెట్లో దీనిని కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి దుద్దిళ్ల స్పష్టం చేశారు.