నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్స్ పాఠశాలల ఏర్పాటు చేయాలనే సీఎం రేవంత్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఎంపీ మల్లు రవి చెప్పారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవన్నారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. వాటిలో ఉపాధ్యాయులు కూడా లేరని తెలిపారు. గత ప్రభుత్వం పాఠశాలలను మూసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలను రద్దు చేయబోమంటూ సీఎం రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విభజన సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.