గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ముద్దసాని సురేష్

నవతెలంగాణ – పెద్దవంగర
గ్రామాలను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, పార్టీ సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రూ నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని బొమ్మకల్ గ్రామంలో సీసీ రోడ్డు పనులను వారు ప్రారంభించి, మాట్లాడారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి సహకారంతో మండలంలోని ప్రతి గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శంగా నిలుపుతామన్నారు. ప్రతి మారుమూల గ్రామాలకు బీటీ రోడ్డు ఏర్పాటయ్యేలా కృషి చేస్తామని అన్నారు. గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో నీటి కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీసు హరికృష్ణ గౌడ్, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు మోతిరామ్, మాజీ వార్డు సభ్యులు బద్రు నాయక్, వెంకటయ్య, పొడిశెట్టి రమేష్, బుద్ధా వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Spread the love