సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి -పైళ్ళ వనిత

నవతెలంగాణ- వలిగొండ రూరల్ : బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని  పైళ్ల వనిత అన్నారు. శనివారం మండలంలోని వేములకొండలో, వెంకటాపురంలో, ముద్దాపురం గ్రామాలలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు  ప్రవేశపెట్టి  అమలు చేస్తున్నారన్నారు. వాటితో పాటు శేఖర్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు అత్యంత మెజార్టీతో శేఖర్ రెడ్డిని గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తుమ్మల వెంకట్ రెడ్డి, బోడ  లక్ష్మి బాలయ్య, పెద్దిరెడ్డి ఉప్పల్ రెడ్డి, కొత్త నర్సింహా, ఎంపీటీసీ సామ రాం రెడ్డి, ఆకుల వెంకన్న, జనార్దన్ రెడ్డి,  వాకిటి గంగిరెడ్డి, సాయిని నాగేష్ , ధర్మారెడ్డి, ఎలగందుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love