Wednesday, September 2, 2026
E-PAPER
Homeజాతీయంప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. పసిడి ప్రియులకు ఇది కొంత నిరాశ కలిగించే అంశమే అయినప్పటికీ, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రమంలో, నేడు (23వ తేదీ) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం, వెండి ధరల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,520గా నమోదైంది. అదేవిధంగా, ఆభరణాల తయారీలో వినియోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,310 వద్ద కొనసాగుతుండగా, 18 క్యారెట్ల ధర రూ.1,09,890గా ఉంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పయనించాయి. కిలో వెండి ధర స్వల్పంగా పెరిగి రూ.2,45,100కి చేరింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, నెల్లూరులోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లోనూ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,570గా ఉండగా, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాల్లో రూ.1,46,520 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -