హీరో అల్లరి నరేష్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’. ఆదివారం ఆయన బర్త్డే సందర్భంగా మేకర్స్ హీరో ఇంటెన్స్ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్బస్టర్లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు.
హీరో ఇంటి దగ్గర లౌడ్స్పీకర్లో భగవద్గీత ప్లే చేయడంతో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది. అది హీరో నిద్రకు భంగం కలిగిస్తుందని దానిని ఫెరోషియస్గా రిమూవ్ చేస్తాడు. తర్వాత లోకల్ బార్లో స్టైల్గా ఆల్కహాల్ సేవించి, అక్కడ ఉన్న గూండాలతో ఫైట్ చేసిన ఎపిసోడ్ అదిరిపోయింది. ‘ఏరు ఎవడి కోసం తగ్గాలి… ఎందుకు తగ్గాలి’ అంటూ అల్లరి నరేష్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ క్యారెక్టర్ మొండి వైఖరిని డిఫైన్ చేసింది. అల్లరి నరేష్ సరసన అమత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ, సంభాషణలు సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్ప్లే, ఎడిషనల్ స్క్రీన్ప్లే విశ్వనేత్ర సమకూరుస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం- విశాల్ చంద్రశేఖర్, డీవోపీ- రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి.
వినూత్న కాన్సెప్ట్తో అల్లరి నరేష్ నయా చిత్రం
హీరో అల్లరి నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన ్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు’ అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ పోస్టర్తో నిర్మాణ సంస్థ ఈ చిత్ర ప్రకటన చేసింది. సంకేత భాషతో రూపొందించిన ఈ పోస్టర్ ఎంతో సజనాత్మకంగా ఉంది. ‘ఫ్యామిలీ డ్రామా’ చిత్రంతో ప్రశంసలు పొందిన రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. నూతన కాన్సెప్ట్తో రూపొం దుతోన్న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించి, ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. అల్లరి నరేష్ నటించబోయే 63వ చిత్రంగా రానున్న ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.29గా రూపొందనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.