అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అవుతాపురం, వడ్డెకొత్తపల్లి తదతర ప్రాంతాల్లో ఎస్సై రాజు ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కలిసి మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించిన ప్రతి కారును, ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీలు నిర్వహించారు. వాహనదారులు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళుతున్నారో ఆరా తీయడంతో పాటు ఆయా వాహనాల నంబర్లను నోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు నగదు తీసుకువెళ్ళేటప్పుడు సంబంధిత ఆధారాలను తమ వెంట తీసుకెళ్లాలని సూచించారు.