గాలి వాన బీభత్సం..

నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలో సాయంత్రం సమయంలో గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది. సుమారు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన వాన 6 గంటల వరకు ఒక గంట ఏకధాటిగా ఉరుములు మెరుపులతో వాన కురిసింది. గంట పాటు పెనుగాళ్లు భయానక వాతావరణ సృష్టించాయి. దుమ్ము ధూళితో కూడిన గాలి వానలు పలు గ్రామాల్లో పూరి గుడిసెల కమ్మలు లేచిపోయాయి. గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల బంజర ఎల్లాపూర్ లో పుణెం సంపత్ కుమార్ చెందిన ఇల్లు గోడలు కూలిపోయాయి. ప్రభుత్వం స్పందించి వర్షానికి కూలిపోయిన గోడలకు నష్టపరిహారం చెల్లించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Spread the love