నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని జుక్కల్ చౌరస్తా హైహే వద్ద ట్రాక్టర్ బొల్తా ఒక మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం బిచ్కుంద మండలానికి చెందిన పలువురు జుక్కల్ మండలంలోని కౌలాస్ ఎల్లమ్మ ను దర్శింతుకుని తిరుగు ప్రయాణంలో జుక్కల్ చౌరస్తా వద్ద ట్రాక్టర్ ఆకస్మత్తుగా బోల్తా కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న మహిళ బిచ్కుంద మండల వాసీ అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరుస్తితి విషమంగా ఉంది. స్థానికులు అంబులెన్స్ కు సమాచారం అందించగా వెంటనే క్షతగాత్రులకు బిచ్కుంద ఆసుపత్రి తరలించారు. పూర్తీ వివిరాలు తెలియాల్సి ఉంది.