- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రకృతి సంరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి అందరూ సీడ్ గణేశుడిని పూజించాలని కోరారు. మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని చెప్పారు. సీడ్ గణేశుడిని పూజించిన అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే.. అందులోని విత్తనం మొలకెత్తి మొక్కగా ఎదిగి మనల్ని ఆశీర్వదిస్తుందని అన్నారు.
- Advertisement -



