అనుమానాస్పద స్థితిలో యువతి మృతి..

నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లి  కమాన్, (గ్రామపంచాయతీ) ముందు  శుక్రవారం ఉదయం గుర్తు తెలియని  మహిళా మృతదేహం పడి ఉందని స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న టౌన్ సీఐ వీరప్రసాద్  తెలిపిన వివరాల ప్రకారం, వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామానికి చెందిన పొన్నం కవితగా  (32)  గుర్తించినట్లు, పట్టణ సీఐ తెలిపారు. మృతురాలి  కుటుంబ సభ్యులు  ఆమె గత నాలుగు రోజులగా ఇంట్లో నుండి వెళ్లిపోయినట్లు ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని, ఫిట్స్  వస్తాయని, ఫిట్స్ మూలంగానే ఆమె చనిపోయి ఉండచ్చని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. మృతురాలి బంధువులు తెలిపిన కోణంలో కాకుండా   హత్యనా, ఆత్మహత్యనా, అనారోగ్య కారణంలో అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లుగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు.
Spread the love