వివేక నంద జయంతిని పురస్కరించుకొని యువత రక్తదానం..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం ధూపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్థానిక యువత రక్తదానం చేశారు. టీవీ విపి బ్లడ్ బ్యాంక్ బోధన్ఆధ్వర్యంలో సుమారు 25 మంది యువత రక్తదానం చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శనిగరం సాయి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శేషు గారి భూమారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు లింగన్న యాదవ్, కోశాధికారి నాగరాజ్, పోశెట్టి, మీకోసం మేము సేవా సంస్థ వ్యవస్థాపకులు లక్ష్మయ్య, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మహేష్, స్థానిక యువత అజయ్ యాదవ్, వెంకటేష్ గౌడ్, మహేష్, ప్రసాద్ ,సందీప్ రెడ్డి, కారోబార్ కిరణ్ రెడ్డి, నవ యువత సభ్యులు పాల్గొన్నారు.
Spread the love