ప్రజాసేవలో యువకులు ముందుకు రావాలి: స్వామి నాయక్

నవతెలంగాణ – నాగార్జునసాగర్
తిరుమలగిరి సాగర్ మండలం నాగార్జున పేట గ్రామం నుండి నాగార్జున సాగర్ వైపు వెళ్ళు దారిలో నిర్మాణంలో ఉన్న మారడుగు పంచముఖ హనుమాన్ ఆలయ అభివృద్ధికి నాగార్జునపేట గ్రామానికి చెందిన ప్రజా ఆరోగ్య నిపుణులు స్వామి నాయక్ జుంపాలి తన వంతుగా రూ.4100 రూపాయల ఆర్దిక సహాయాన్ని ఆలయ కమిటీకి అందించారు. అలాగే ఆర్ధిక స్థోమత కలిగిన గ్రామ ప్రజలు ,యువకులు మరియు ఇతర గ్రామాల ప్రజలు ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి ముందుకు వచ్టి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆంగోతు శ్రీను,జుంపాలి,సోమ్ల,భోజు,బాలాజీ పాల్గొన్నారు.
Spread the love