- Advertisement -
నవతెలంగాణ న్యూఢిల్లీ:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్కు విద్యార్థులు, యువత భారీగా తరిలివచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అయినా వాటిని పట్టుకోకుండా యువత, విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం చేపట్టిన ‘చలో సంసద్’జయప్రదం చేయాలని జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. అనంతరం వారంతా ర్యాలీగా పార్లమెంట్ భవన్ వైపు దారితీశారు.
- Advertisement -



