పేదింటి ఆడపిల్ల పెళ్ళికి జడ్పీటీసీ ఆర్థికసాయం

నవతెలంగాణ-ఆమనగల్: కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన పేదింటి ఆడపిల్ల అనూష పెళ్ళికి జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ ఆర్థికసాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన బొడ్డుపల్లి ఆనూషకు ఆమె నాయనమ్మ అన్ని తానై తనకు ఉన్నదాంట్లో అనూష వివాహం చేయడానికి నిశ్చయించుకుంది. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ దశరథ్ నాయక్ గురువారం వివాహ ఖర్చుల నిమిత్తం తనవంతు సహాయంగా జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆనూషకు రూ.10,116 లు అందజేశారు. ఈకార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, రైతు సమన్వయ జిల్లా కమిటీ సభ్యులు బాచిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షులు జోగు వీరయ్య, సర్పంచ్ భాగ్యమ్మ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love