భూకంప బాధితులకు బాసటగా కంట్రీక్లబ్‌ వినూత్న శైలి

నవతెలంగాణ-సిటీ బ్యూరో
సుసంపన్నమైన సంస్కతి మీది… విపత్తులెన్నో తట్టుకుని విజేతలుగా నిలబడిన చరిత్రకు చిరునామా మీది… గెట్‌ వెల్‌ సూన్‌ మిత్రదేశమా అంటూ సంఘీభావం తెలుపుతూ కంట్రీక్లబ్‌ నిర్వహించిన వినూత్న శైలి ర్యాంప్‌వాక్‌ అందర్నీ ఆకట్టుకుంది. భూకంపం ధాటకి చిక్కి విలవిల్లాడుతున్న టర్కీ, సిరియాలకు సానూభూతి, సంఘీభావంగా బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో ఆదివారం వైవిధ్యభరితమైన ర్యాంప్‌ వాక్‌, ప్లేలను నిర్వహించారు. దాదాపుగా 30 నిమిషాల పాటు సాగిన ఈ ప్రదర్శనలో టర్కీ, సిరియా దేశాలకు చెందిన ఘనమైన సంస్కతీ సంప్రదాయాలకు పట్టం కట్టారు. ఆ దేశాల చారిత్రక వైభవాన్ని గుర్తు చేశారు. ఘన వారసత్వ స్ఫూర్తితో గాయాల నుంచీ కోలుకోవాలని కాంక్షించారు. కనువిందుగా విజ్ఞాన విశేషాల సమాహారంగా సాగిన ఈ ర్యాంప్‌ వాక్‌ కమ్‌ ప్లే అహుతులకు ఆసక్తికరమైన అనుభూతిని అందించింది. అతిధుల హర్షధ్వానాలు అందుకుంది. ఈ సందర్భంగా కంట్రీక్లబ్‌ సి.ఎం.డి వై.రాజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ …దేశాల మధ్య, జాతుల మధ్య ఉండాల్సిన సహౌదర భావం, మైత్రీ బ్యంధం, శ్రేయోభిలాష గుణం మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసేందుకు, కనీ వినీ ఎరుగని విపత్తుని ఎదుర్కుంటూ కష్టాలను ఢకొీని పోరాడుతున్న టర్కీ, సిరియా దేశాలకు ”మీరు ఒంటరివాళ్లు కారు మేమున్నా మని” మన వంతుగా నమ్మకం కలిగించే బాధ్యత అందరి మీదా ఉందని తెలియజేసేందుకే ఈ ర్యాంప్‌ వాక్‌ని వినూత్నంగా నిర్వహించామన్నారు. .

Spread the love