గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల

– ఈ నెల 5 చివరి గడువు
– రీజినల్ కో ఆర్డినేటర్ టి.సంపత్ కుమార్
నవతెలంగాణ-కంటేశ్వర్
రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైందని ఆ సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త టి. సంపత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.tgtwgurukulam.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 5 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా మెరిట్ ఆధారంగా అడ్మిషన్లను కల్పిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం (మెదక్ – 7901097706) (కామారెడ్డి  -7901097707) (నిజామాబాద్ -7901097710) సంప్రదించగలన్నారు.

Spread the love