- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లా, గణపవరం మండలం ఎస్ కొండెపాడులో బజ్జీలు తిన్న 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆక్వా చెరువుల దగ్గర పనిచేస్తున్న కూలీలు మైదా పిండితో చేసిన బజ్జీలు తినడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం. బాధితులకు వాంతులు, విరేచనాలు కావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం బాధితులు కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



