నవతలెంగాణ – హైదరాబాద్: జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికగా ఐసీసీ 20 ప్రంపచకప్-2024 అట్టహాసంగా ముగిసింది. మెగా టోర్నీలో తొలిసారిగా 20 జట్లు పాల్గొన్నాయి. తాజాగా ఐసీసీ 2026 వరల్డ్ కప్ షెడ్యూల్ను ఫార్మాట్ను ప్రకటించింది. ఈ ఐసీసీ పొట్టి ప్రంపచకప్కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆదిథ్యమివ్వనున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ తరహాలోనే టోర్నీ జరుగనున్నది. 2024 తరహాలోనే 2026లో వరల్డ్ కప్లోలోనూ 20 జట్లతో టోర్నీ జరుగుతుందని ఐసీసీ పేర్కొంది. వచ్చే వరల్డ్ కప్కు మొత్తం 12 జట్లు నేరుగా అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య హోదాలో రెండు, గత టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ఏడు జట్లకు అర్హత లభించనున్నది. ఐసీసీ ప్రస్తుత ర్యాంకుల ఆధారంగా మరో మూడుజట్లు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య జట్ల హోదాలో భారత్, శ్రీలంక అర్హత సాధించాయి. మెరుగైన ర్యాంకుతో న్యూజిలాండ్, ఐర్లాండ్, పాకిస్థాన్ టోర్నీలో ఆడబోతున్నాయి. ఇక మరో ఎనిమిది జట్లకు క్వాలిఫైయింగ్ టోర్నీ నిర్వహించనున్నారు. ఇక ప్రస్తుత టోర్నీలో మాదిరిగా 20 జట్లు నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఆ తర్వాత గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ 8కు చేరుతాయి. సూపర్ 8లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇస్తాయి. సెమీఫైనల్లో గెలుపొందిన జట్లు ఫైనల్లో ఆడుతాయని ఐసీసీ వివరించింది.