నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: నైజీరియాలోని నార్త్‌ఈస్ట్‌ బోర్నో రాష్ట్రంలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. మరో 48 మంది గాయాల పాలయ్యారు. శనివారం జరిగిన ఓ వివాహ వేడుకలో మొదటి బాంబు పేలుడు చోటు చేసుకుంది. అనంతరం గ్వోజాలోని ఆసుపత్రిలో, ఓ అంత్యక్రియలు జరుగుతున్న చోట వరుస పేలుళ్లు సంభవించాయి. ఘటనాస్థలిలో సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Spread the love