Congress: మెదక్ లో నేడు కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర

నవతెలంగాణ – మెదక్ : తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర ఆదివారం మెదక్ పార్లమెంట్ పరిధిలో జరగనుంది. ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డిలోని గంజ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొననున్నారు. నర్సాపూర్‌లో 4 గంటలకు కార్నర్‌లో జరగనున్న మీటింగ్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే ఆదివారం సాయంత్రం 6 గంటలకు మెదక్‌లో జరిగే సభకు మల్లికార్జున ఖర్గే హాజరవుతారు. తెలంగాణలో రెండో విడత కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం నుంచి నవంబర్ 1వ తేదీ వరకు రెండో విడత బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొననున్నారు.

Spread the love