– టోంక్ జిల్లాలో సచిన్ పైలట్ నామినేషన్
జైపూర్: రాజస్థాన్లోని టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి సచిన్ పైలట్ నామినేషన్ దాఖలు చేసిన కొన్ని గంటల తర్వాత, రాజస్థాన్ ఎన్నికల కోసం కాంగ్రెస్ 56 మంది అభ్యర్థులతో నాల్గవ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో కొత్తగా 32 మంది అభ్యర్థులు ఉండటం గమనార్హం.
ఇద్దరు మద్దతిస్తున్న స్వతంత్రులు కాక 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థిత్వాన్ని పొందారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ జాబితాలో తన మద్దతుదారులకు టిక్కెట్లు పొందడంలో విజయం సాధించారు, అయినప్పటికీ పైలట్ విధేయులకు కూడా కొన్ని టిక్కెట్లు దక్కాయి. అయితే, ఈ జాబితాలో కూడా గత సంవత్సరం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటుకు కారణమైన గెహ్లాట్ అనుచరులు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శాంతి ధరివాల్ , నీటి సరఫరా మంత్రి మహేష్ జోషి పేర్లు లేవు.
ఈ జాబితా తర్వాత, పార్టీ మొత్తం 200 మందిలో 151 మంది అభ్యర్థులను ప్రకటించింది. రాజస్థాన్లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 25న ఓటింగ్ జరగనుంది, ఫలితాలు డిసెంబర్ 3న జరగనున్నాయి. అంతకుముందు రోజు సచిన్ పైలట్ తన వైఖరిని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిని ఖరారు చేస్తారు. ”ఎవరూ ఒకరి సలహా ఆధారంగా లేదా స్వీయ ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి కాలేరు,” అని ఆయన అన్నారు.
సీఎం అశోక్ గెహ్లాట్ తన ఎన్నికల ప్రచారంలో తాను విజయం సాధిస్తే మరోసారి బాధ్యతలు చేపడతానని సూ చించిన తరుణంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. రాజస్థాన్ అభ్యర్థులపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరి గాయి. నాలుగో జాబితా జాప్యంపై పార్టీలో కలకలం చెలరేగినట్లు సమాచారం.
ఉదరుపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ జాతీయ అధి కార ప్రతినిధి గౌరవ్ వల్లభ్కు టిక్కెట్టు ఇచ్చారు. బాలి స్థానం నుంచి మాజీ ఎంపీ బద్రీ రామ్ జాఖర్ పోటీ చేయ నున్నారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర సింగ్కు బార్మర్లోని శివనా స్థానం నుంచి టిక్కెట్టు ఇచ్చారు.
సారాతో విడాకులు
మీడియాతో తన ఇంటరాక్షన్ సందర్భంగా, సచిన్ పైలట్ జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమార్తె అయిన తన భార్య సారాకు విడాకులు ఇచ్చినట్టు అంగీకరించారు. టోంక్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ విషయాన్ని పేర్కొన్నారు.