- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమురు పైప్లైన్ నుంచి ముడి చమురు దొంగిలించే ప్రయత్నంలో విషవాయువులను పీల్చి సుమారు 37 మంది మృతి చెందారు. పలువురు వ్యక్తులు పైపులైన్ నుంచి ఇంధనాన్ని తమ పడవల్లో నింపుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంకా చాలా మంది గల్లంతు అయినట్లు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
- Advertisement -


