నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ రుక్మిణీ పాండురంగ రంగ విఠలేశ్వర పరివారం దేవతల 41వ మండల పూజలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, బిఅర్ఎస్ పార్టీ ఎన్అర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల వరి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణీ పాండురంగ రంగ విఠలేశ్వర స్వామివారికి సుప్రభాతం సేవలు, అభిషేకం, గణపతి పూజ, స్వస్తి పుణ్యవాహచనం, నవగ్రహ మండపం ఆరాధన కలశ స్థాపన పూజ ఆవహిత దేవతల హోమం, పూర్ణాహుతి, మహా హారతి, మంత్ర పుష్పం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేసి భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కిరణ్, బిఅర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.